ఎల్లుండి నుంచి హుజురాబాద్ లో బండి సంజయ్ ప్రచారం

-

హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఉప ఎన్నికలకు కేవలం పది రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. బిజెపి పార్టీ తరఫున ఈటల రాజేందర్ సింగిల్ గా ప్రచారం చేస్తుండగా… అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నీ తానై ముందుకు సాగుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ కూడా తాజాగా ఫిక్స్ అయింది. ఈ నెల 20 వ తేదీ నుండి 27 వ తేదీ వరకు అంటే వారం రోజుల పాటు బండి సంజయ్ ప్రచారం నిర్వహించనున్నారు. బండి సంజయ్ తో హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక ప్రచారం లో బిజేపి కీలక నేతలు పాల్గొననున్నారు.

21, 22, 23, 25, 26 తేదీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు 22 వ తేదీ నుండి ప్రచారం చివరి రోజు వరకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఉప ఎన్నిక ప్రచారం లో పాల్గొన నున్నారు. రెండు రోజులు లక్ష్మణ్, 5 రోజులు విజయ శాంతి ల ప్రచారం నిర్వహించనున్నారు. 21 నుండి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ పర్యటన చేయనున్నారు. కాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఈ నెల 30 వ తేదీన జరుగనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news