పాకిస్థాన్ కు గుణపాఠం చెప్పాలి – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

పాకిస్థాన్ కు గుణపాఠం చెప్పాలంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పై ఇష్టను సారంగా మాట్లాడారని.. ప్రపంచం గొప్ప నాయుకుడిగా మోడీ ని అందరూ చూస్తున్నారని పేర్కొన్నారు. పాకిస్థాన్ అంటేనే ఉగ్రవాదుల దేశమని.. టెర్రరిస్టులకు స్థావరాలు పాకిస్తాన్ లో ఉన్నవని పేర్కొన్నారు.

నరేంద్రమోదీ టెర్రరిస్ట్ కాదు..గుజరాత్ అల్లర్లలో మోడీ ని అమెరికా రాకుండా చేస్తే ..సుప్రీంకోర్టు తీర్పు తరువాత రెడ్ కార్పెట్ తో ఆమెరికా స్వాగతం పలికిందని వెల్లడించారు. పాకిస్థాన్ మన దేశంలో విమర్శలు చేస్తే ప్రతి భారతీయుడు స్పదించాలని కోరారు.

సర్జికల్ స్ట్రైక్ రావొద్దు అంటే పాకిస్తాన్ జాగ్రత్తగా ఉండాలన్నారు. G20 సదస్సు కు ఆథిద్యం ఇస్తున్న దేశం భారత దేశం అని పేర్కొన్నారు. బిలావర్ బుట్టో తల్లి ని పాకిస్తాన్ టెర్రరిస్ట్ లు పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. ఫైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ ను పట్టించుకోనని..ఎవరికి పడితే వారికి స్పందించనని తేల్చి చెప్పారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news