లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రపై రేవంత్‌ నోరుమెదపరేం?: బండి సంజయ్‌

-

దిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఎందుకు నోరుమెదపడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై స్పందించకపోవడం..బీఆర్ఎస్, కాంగ్రెస్​లు ఒక్కటేనని రుజువు చేస్తున్నాయని అన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయంపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, మజ్లిస్ జెండాలు చూస్తే మహిళలు భయపడుతున్నారని అన్నారు.

హైదరాబాద్​లోని బీజేపీ కార్యాలయంలో ‘మహిళా గోస- బీజేపీ భరోసా’ దీక్ష పేరిట ఆ పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. బెల్టు షాపులను వ్యతిరేకిస్తూ బీజేపీ మహిళా మోర్చా నేతల దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్షను ప్రారంభించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. మహిళలపై అత్యాచారాలు నిరసిస్తూ దీక్ష చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news