ప్రతీ గింజ కేసీఆరే కొనాలి..కొనకపోతే అంతు చూస్తాం : బండి సంజయ్‌

-

తెలంగాణలో రైతులు పండించిన ప్రతీ గింజ ను కేసీఆరే కొనాలని… కొనుగోలు చేయకపోతే.. అంతు చూస్తామని వార్నింగ్‌ ఇచ్చారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. వానా కాలం పంటను ఎలా కొంటున్నావో…. యాసంగి పంటను కూడా అలాగే కొనాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్‌. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు వస్తుందో సీఎం కేసీఆర్‌ రైతులకు సమాధానం చెప్పాలని ఫైర్‌ అయ్యారు.

సీఎం కేసీఆర్‌ భాష చాలా అభ్యంతరకరంగా ఉందని నిప్పులు చెరిగారు. ముడి బియ్యం కొంటామని కిషన్‌ రెడ్డి ఇప్పటికే చెప్పారని బండి సంజయ్‌ గుర్తు చేశారు. ఢిల్లీ వెళ్లొచ్చాక కేసీఆర్‌ పిచ్చి ఇంకా ముదిరిందని ఎద్దేవా చేశారు బండి సంజయ్‌. సీఎం కేసీఆర్‌ చాలా జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్‌ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ తీరును అందరూ ఛీ కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్‌.సీఎం కేసీఆర్‌ భాష చాలా దారుణంగా ఉందని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news