మెడ మీద కత్తి పెడితే ఫామ్ హౌజ్ రాసిస్తావా..? కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్

-

ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. నిన్న కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మెడ మీద కత్తి పెడితే ఫామ్ హౌజ్ రాసిస్తావా.. అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి పిచ్చి ముదిరిందన్నారు. కేంద్ర మంత్రిపై మాట్లాడే భాష ఇదేనా అని అన్నారు. జాగ్రత్తగా మాట్లాడాలని.. మీ మాటలను తెలంగాణ ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల్సిందే.. పండించిన ప్రతీ గింజను కొంటామని నువ్వే అన్నావ్ అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

పాత బియ్యాన్ని గోడౌన్లలో నింపారని.. కొంత మంది మిల్లర్లకు ఇబ్బందులు వస్తాయనే కేసీఆర్ కొత్తగా డ్రామాలు మొదలుపెట్టారన్నారు. కేసీఆర్ కు పాకిస్థాన్ పై ప్రేమ ఎక్కువగా ఉందని.. మాట్లాడినప్పుడల్లా పాకిస్థాన్, బంగ్లాదేశ్ లను గుర్తుచేసుకుంటున్నారన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పై కేసీఆర్ మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. నేపాల్ , బంగ్లాదేశ్, పాకిస్థాన్ జనాభా ఎంతో తెలుసుకోవాలని ఆతరువాత గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పై మాట్లాడాలన్నారు.

తెలంగాణలో బాయిల్డ్ రైస్ కాకుండా 5 రకాల బియ్యం పండుతాయని.. వీటిపై ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నారని కేసీఆర్ ను ప్రశ్నించారు. నీ పాలనలో రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news