టిఆర్ఎస్ రద్దుతో తెలంగాణకు కేసిఆర్ పీడపోయింది – బండి సంజయ్

-

టిఆర్ఎస్ రద్దీతో తెలంగాణకు కెసిఆర్ పీడిపోయిందన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నేడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర జగిత్యాల జిల్లాలో కొనసాగుతుంది. ఇవాళ 12వ రోజు పాదయాత్రను కోరుట్ల మండలం వేంపేట నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పార్టీ పేరులో తెలంగాణను తీసేశారని.. ఇక్కడ చల్లని రూపాయి.. అక్కడ చెల్లుతుందా అని ప్రశ్నించారు.

ఉద్యమ సమయంలో, అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఉండే వారంతా దొంగల ముఠాల బయలుదేరారని.. దేశంలో పార్టీ పెట్టినప్పుడు, రాష్ట్రంలో ఏం చేశారో చెప్పాలన్నారు. దొంగ దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేశారని.. ఇప్పుడు దేశాన్ని మోసం చేయాలనుకుంటున్నారా అని మండిపడ్డారు. తెలంగాణలో రంగురంగుల జెండాలు పోవాలి.. డబుల్ ఇంజన్ సర్కార్ కమలం వికసించాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు తూకంలో జరుగుతున్న మోసాలపై, రైతుల అక్రమ అరెస్టుల పై ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news