బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలది భూ కబ్జాలు, అవినీతి లొల్లి : బండి సంజయ్‌

-

తాను ఎక్కడికెళ్లినా కరెంట్ కట్ చేస్తున్నారని.. మరో 15 రోజుల్లో కేసీఆర్ పవర్ కట్ కాబోతుందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ లోని భగత్ నగర్, రామచంద్రాపూర్, బొమ్మకల్ , అంజనాద్రి కాలనీల్లో ప్రచారం చేశారు సంజయ్. తనను అసెంబ్లీకి రానివ్వకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాను పేదల కోసం కొట్లాడుతున్నానని కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు బండి సంజయ్.

Bandi Sanjay Kumar: Hindutva is central to party's campaign in State:  Telangana BJP president Bandi Sanjay Kumar - The Economic Times

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలది భూ కబ్జాలు, అవినీతి లొల్లి అన్నారు బండి సంజయ్. ఇంటి ముందు ఇసుక కుప్పలు కనిపిస్తే బీఆర్ఎస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఖాళీ జాగాలు కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్న గంగుల… కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. యువతక ఉద్యోగాల కోసం తాను కేసీఆర్ పై కొట్లాడి.. జైలుకు పోయానని చెప్పారు.

కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ప్రమోషన్ల కోసం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారు. 30 వేల కోట్ల రూపాయలతో అయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష 30 వేల కోట్లకు పెంచి కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారు. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఎవరైనా నిరుద్యోగుల కోసం కొట్లాడి జైలుకు పోయారా. పొన్నం ప్రభాకర్ ఎప్పుడైనా జైలుకెళ్లాడా, లాఠీ దెబ్బలు తిన్నాడా నేను లాటి దెబ్బలు తిన్నాను, జైలుకెళ్లాను. తిండికి లేని కేసీఆర్ కుటుంబానికి ఇవాళ లక్షల కోట్లు ఎలా వచ్చాయి’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news