సీఎం కేసీఆర్​కు బండి సంజయ్ బహిరంగ లేఖ

-

ముఖ్యమంత్రి కేసీఆర్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, పింఛనుదారులకు పింఛన్లు ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21, ఆర్టికల్‌ 300(ఏ) చట్టం.. సకాలంలో ఉద్యోగులు, పింఛనుదారులు వేతనం పొందే ప్రాథమిక హక్కుని కల్పించిందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వారి జీవించే హక్కును కాలరాయడమేనని సంజయ్ మండిపడ్డారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 360 ప్రకారం ఫైనాన్షియల్‌ ఎమర్జెన్సీ ప్రకటిస్తే తప్ప ఉద్యోగుల, పెన్షన్‌దారుల చెల్లింపులు ఆలస్యం చేయకూడదని అన్నారు.

ఇవే కాకుండా.. ఇతర అత్యవసర బిల్లులు కూడా ప్రభుత్వం పెండింగ్​లో పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్‌ రియంబర్స్‌మెంట్‌, సరెండర్‌ లీవ్‌, జీపీఎఫ్‌, అడ్వాన్స్‌లు, పార్ట్‌ ఫైనల్‌ విత్‌డ్రాయల్‌… ఇలా అన్ని బిల్లులు నెలల తరబడి పెండింగులో ఉంటున్నాయని పేర్కొన్నారు. 2014లో 16వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని నేడు అప్పులపాలు చేశారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news