బిగ్ బ్రేకింగ్ : కేసీఆర్ జైల్ కి, తెలంగాణకు మధ్యంతర ఎన్నికలు !

-

గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రోజుకో రకం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన ఏకంగా ప్రభుత్వం కుప్పకూలుతుందని కామెంట్ చేశారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పెట్టి ఓట్లు కొంటున్నారని కానీ బీజేపీ అభ్యర్థులు ప్రజల్లో తిరుగుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన పైసలు పక్కాగా తీసుకోండన్న ఆయన ఓట్లు మాత్రం బీజేపీ కి వెయ్యండని అన్నారు. ఒక్కో డివిజన్ కి టీఆర్ఎస్ 5 కోట్లు పంచుతుందని ఆయన అన్నారు. కారు,కేసీఆర్ సారు…ఇక రారు అంటూ ఆయన కామెంట్స్ చేశారు.

ఈ ఎన్నికల తరువాత అవినీతి ప్రభుత్వం కూలిపోతుందని, కేసీఆర్ జైల్ కి పోవడం ఖాయం అని అన్నారు. కేంద్రం అన్ని లెక్కలు తేల్చుతుందని తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని అన్నారు. అమిత్ షా వస్తున్నాడు…టీఆర్ఎస్ జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆయన కామెంట్ చేశారు. తాగి బండి నడిపితే పోలీసులు కేసు పెడుతున్నారు మరి తాగి రాష్ట్రాన్ని నడపడం నేరం కాదా. కేసీఆర్ ని జైల్ లో పెట్టోద్దా అని అంటూనే కేసీఆర్ బ*బాజ్ అంటూ బండి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news