బరాబర్ హిందువుల కోసమే: బండి సంజయ్

-

బిజెపి బరాబర్ హిందువుల కోసమే పోరాడుతుంది అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేసారు. హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తెరాస సర్కార్ టార్గెట్ గా విమర్శలు చేసారు. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే మళ్ళీ ఇచ్చారు అని ఆయన విమర్శలు చేసారు. బిజెపి గెలిస్తే కచ్చితంగా 25 వేలు బ్యాంకు ఖాతాలో వేస్తామని ఆయన స్పష్టం చేసారు.

తెలంగాణాలో బిజెపి కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. వరద సాయం 10 వేలు ఇస్తామని ఇవ్వని కేటిఅర్ కావాలా 25 వేలు ఇస్తామన్న బిజెపి కావాలా అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి భాగ్యనగరం కావాలా అరాచక భాగ్యనగరం కావాలా అని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news