పోరాటానికి సిద్ధం కండి : కృతి సనన్

-

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న కృతిసనన్ అటు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అనే విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైనది ఈ ముద్దుగుమ్మ. అంతే కాకుండా పలువురు హీరోల సరసన కూడా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సామాజిక అంశాలపై మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటుంది ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తరచూ సోషల్ మీడియాలో పోరాటం చేస్తూనే ఉంటుంది.bolly wood

ఇక ఇటీవలే మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులకు సంబంధించి మహిళా లోకానికి ఒక కీలక పిలుపునిచ్చింది కృతిసనన్. జాతీయ మహిళా కమిషన్ త్వరలో నిర్వహించబోతున్న కార్యక్రమాన్ని గురించి ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా భారత్ అనే కార్యక్రమాన్ని జాతీయ మహిళా కమిషన్ ఈ నెల 25 నుంచి వరుసగా మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఎంతోమంది మహిళలు యువతులు తరలిరావాలని పోరాటానికి సిద్ధం కావాలి అంటూ పిలుపునిచ్చింది కృతి సనన్.

Read more RELATED
Recommended to you

Latest news