బెంగళూరు డ్రగ్స్‌ కేసులో రోహిత్‌రెడ్డి పాత్ర ఉంది: బండి సంజయ్‌

-

బెంగళూరు డ్రగ్స్‌ కేసులో రోహిత్‌రెడ్డి పాత్ర ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు రోహిత్ రెడ్డితో హడావుడిగా స్టేట్మెంట్ రికార్డు చేయించారని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా పోడూరులో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

బెంగళూరు డ్రగ్స్ కేసులో పైలెట్ రోహిత్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకునేందుకు తమ లీగల్ టీమ్ బెంగుళూరు వెళ్లిందని తెలిపారు. బెంగుళూరు డ్రగ్స్ కేసు రీఓపెన్ చేస్తే చాలా విషయాలు బయటపడతాయి అన్నారు. ఎమ్మెల్యే పాత్రపై విచారణ చేయాలని కోరతానని బండి సంజయ్ పేర్కొన్నారు. తమ లీగల్ టీమ్ వెళ్లిన విషయాలను బెంగుళూరు అధికారులు, హైదరాబాద్ లో లీక్ చేశారని, దీంతో సీఎం కేసీఆర్ హడావుడిగా ఎమ్మెల్యేలకు ఎర కేసులో పైలట్ రోహిత్ రెడ్డితో జడ్జి ఎదుట స్టేట్మెంట్ రికార్డు చేయించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news