2023లో అధికారంలోకి వస్తాం.. చార్మినార్ దగ్గర సభ పెడతాం : బండి సంజయ్

-

2023 లో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. మొదటి బహిరంగ సభ చార్మినార్ భాగ్య లక్ష్మీ అమ్మ వారి దగ్గరే పెడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఓల్డ్ సిటీ కి మెట్రో తీసుకెళ్తామని.. ఓల్డ్ సిటీ అభివృద్ధి చేస్తామన్నారు బండి సంజయ్.

అధికారంలోకి వచ్చాక మెదటి బహిరంగ సభ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద నిర్వహిస్తామన్న బండి సంజయ్.. తెలంగాణ బీజేపీ అడ్డా అని పేర్కొన్నారు. 2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేసే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రజా సంగ్రామ యాత్రకు భారీగా తరలివస్తోన్న భాగ్యనగర్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు.

పాతబస్తీకి మెట్రోరైల్ ను ఎంఐఎం పార్టీ అడ్డుకుందని.. పాతబస్తీని అభివృద్ధి ఎందుకు చేయటలేదో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. పాతబస్తీలో హిందూ సమాజానికి బీజేపీ అండగా ఉంటోందని.. పాతబస్తీలో బీజేపీ కోసం హిందూ సమాజం సంఘటితమవుతోందన్నారు. గో రక్షణ కోసం కృషి చేస్తోన్న ఎమ్మెల్యే రాజసింగ్ పై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news