కవితపై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు..రూ. 20 లక్షల గడియారమెందుకు !

-

 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌. తెలంగాణ పరువు తీసిన కల్వకుంట్ల కుటుంబం మీద ఎన్ని వేల కోట్ల పరువు నష్ట దావా వేయాలంటూ ప్రశ్నించారు బండి సంజయ్. 30 లక్షల మంది యువత భవితకు విలువ ఇవ్వనోడి పరువు ఖరీదు రూ. 100 కోట్లట అని.. దేశంలోనే అందరికంటే ఎక్కువ జీతం తీసుకుంటూ ఏ బాధ్యతా నిర్వర్తించనోడు దేశ్ కీ నేతా అట అంటూ విమర్శలు చేశారు.

చేతికి రూ 20 లక్షల గడియారమేసుకొని ఆడబిడ్డల్ని ఏమాత్రం పట్టించుకోని వ్యక్తి తెలంగాణ మహిళల ప్రతినిధి అట అంటూ కవితపై ఫైర్‌ అయ్యారు. లిక్కర్ దందాలు చేసి తెలంగాణ పరువు తీసిన కల్వకుంట్ల కుటుంబం మీద ఎన్ని వేల కోట్ల పరువు నష్టం దావా ఎయ్యాలే ప్రజలు? అని నిలదీశారు. తెలంగాణ ప్రజల బతుకుల్ని ఆగం చేస్తున్న బీఆర్ఎస్ పైన ఎన్ని లక్షల కోట్ల పరువు నష్టం దావా ఎయ్యాలే ? ఈ కుటుంబ పార్టీకి ప్రజాకోర్టుల శిక్ష తప్పదు – చేసిన పాపాలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news