కేసీఆర్ ను ఉరికించి కొడుతామని అన్న వాళ్ళకే మంత్రి పదవి !

-

హైదరాబాద్ నాచారం ఏఎన్నార్ గార్డెన్ లో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ మీద టీఆర్ఎస్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఓటు వేయమని కేసీఆర్ ఆడిగారా ? మరి అలాంటి పార్టీకి ఓటు ఎందుకు వేయాలి ? అని ఆయన ప్రశ్నించారు.  నేను వల్గర్ గా మాట్లాడుతున్నాను అంటున్నారు. నా గురువే కేసీఆర్…నేను గురు దక్షిణ ఇస్తున్నాను అని అన్నారు. గోడకు వేసిన తుపాకీ తుప్పు పట్టి పోయిందని, కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటారని అన్నారు. 

నేను ఎలాంటి బెదిరింపులకు భయపడను, నా కార్యకర్తలను కాపాడుకోవడమే నా లక్ష్యం అని అన్నారు. వరంగల్ లో స్మార్ట్ సిటీకి కేంద్రం నిధులు ఇచ్చిన…రాష్ట్ర వాటా ఇవ్వడం లేదని కేంద్రం ప్రాజెక్టులకు రాష్ట్రం సహకరించడం లేదని అన్నారు. రాజ్యాంగబద్ధ సీఎం  పదవి కేసీఆర్ కి ఇస్తే చెప్పుతో పోల్చారని, బీజేపీ ని వాట్స్ అప్ యూనివర్సిటీ అనే నైతిక అర్హత టి ఆర్ ఎస్ కు లేదని అన్నారు. కేసీఆర్ ను ఉరికించి కొడుతామని అన్న వాళ్ళకే మంత్రి పదవి ఇచ్చారని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news