కోర్టుకు హాజరైన బండ్ల గణేష్..!

-

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ బుధవారం ప్రొద్దుటూరు కోర్టులో ప్రత్యక్షమవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చెక్ బౌన్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బండ్ల గణేష్ కోర్టు వాయిదాకు హాజరైనట్లు కోర్టు వర్గాలు తాజాగా వెల్లడించాయి.. బండ్ల గణేష్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎదుట హాజరయ్యారు. ఈ కేసును జడ్జ్ ఫిబ్రవరి 22 కు వాయిదా వేయగా .. విచారణ ముగిసిన అనంతరం బండ్ల గణేష్ అక్కడి నుండి హైదరాబాద్ వెళ్లిపోయారు. నటుడిగా బండ్ల గణేష్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పలు చిత్రాలలో కమెడియన్ గా హీరో ఫ్రెండ్ పాత్రలు పోషించారు.

ఆ తర్వాత నిర్మాతగా మారి శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ స్థాపించి 2009లో ఆంజనేయులు మూవీ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి దగ్గరైన బండ్ల గణేష్.. తీన్మార్ , గబ్బర్ సింగ్ వంటి చిత్రాలు నిర్మించారు . తీన్మార్ చిత్రం నష్టాలు మిగిలిచినప్పటికీ గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. ఇటీవల అన్ స్టాపబుల్ షో లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

నిర్మాత బండ్ల గణేష్ నేను అనుకున్నంత రెమ్యునరేషన్ ఇవ్వలేదు.. తాను అనుకున్నంత ఇచ్చారు అంటూ పవన్ చెప్పడంతో ఇది కాస్త చర్చకు దారితీసాయి. బాద్ షా , టెంపర్ చిత్రాలు కూడా తెరకెక్కించారు. డేగల బాబ్జి టైటిల్ తో తమిళ రీమేక్ చేశారు బండ్ల గణేష్. అలాగే మోహన్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన సన్నాఫ్ ఇండియా, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలలో కూడా నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news