పోస్టాఫీసు ఉద్యోగాలకి అప్లై చేశారా..ఈ రోజే చివరి తేదీ..

-

నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతూ వస్తుంది.. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తుంది. తాజాగా పోస్టల్ శాఖలో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఆ జాబ్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2023కి దరఖాస్తు చేసుకోవాలనుకునే యువతకు ఇది చివరి అవకాశం. ఈ నోటిఫికేషన్‌ కింద పోస్ట్‌ మాస్టర్‌, డాక్ సేవక్ పోస్టుల భర్తీ చెయ్యనున్నారు.అర్హులైన అభ్యర్థులు రేపటిలోపు అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది..

 

 

*. ఈ రిక్రూట్‌మెంట్‌లు BPM, ABPM, డాక్ సేవక్ పోస్టుల భర్తీ జరుగుతుంది. పోస్ట్‌ల శాఖలో మొత్తం 40,889 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ సర్కిల్‌లో గరిష్టంగా 7,987 ఖాళీలు, తర్వాత తమిళనాడులో 3,167, కర్ణాటకలో 3,036, ఆంధ్రప్రదేశ్‌లో 2,480 ఖాళీలు ఉన్నాయి..

*. ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి చివరి తేదీ 16 ఫిబ్రవరి 2023. దరఖాస్తు ఫారమ్‌లో ఏదైనా లోపం ఉంటే 17 నుంచి 19 ఫిబ్రవరి 2023 వరకు సరిచేసుకోవచ్చు..

*. 2023కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
*. అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి బోర్డు పరీక్షలో గణితం, ఇంగ్లీషు తప్పనిసరి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. మహిళలు, ట్రాన్స్ ఉమెన్ అభ్యర్థులు, SC, ST కేటగిరీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.inకి వెళ్లాలి.

ఇక్కడ తగిన వివరాలతో మిమ్మల్ని మీరు నమోదు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియను కొనసాగించి ఫారమ్‌ను నింపాలి.

ఇప్పుడు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి డౌన్‌లోడ్ చేయాలి.

చివరగా దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి..

ఆసక్తి కలిగిన వాళ్ళు.. indiapostgdsonline.gov.inని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు .

Read more RELATED
Recommended to you

Latest news