చౌటుప్పల్ రోడ్డు ప్రమాదం.. ఆటో, బస్సు ఢీకొని నలుగురు మృతి

-

యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం దండుమల్కాపుర్ వద్ద ఆటో, ప్రైవేట్ బస్సు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్​కు తరలించినట్లలు తెలిపారు. బాధితులంతా పారిశ్రామికవాడలో పని చేస్తున్నట్లు సమాచారం. మృతులు దేవాలమ్మ నాగారం గ్రామానికి చెెందిన నాగలక్ష్మి(28), వరకాంతం అనసూయ (55), ధనలక్ష్మి (35), దేవరపల్లి శిరీష(30)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news