బండి పాదయాత్ర ఎవరి కోసం… ధరలు ఇంకా పెంచాలని యాత్ర చేస్తున్నారా?: బట్టి విక్రమార్క

-

బండి సంజయ్ ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నారు… ధరలు తగ్గించాలిన పాదయాత్ర చేస్తున్నారా..? ధరలు ఇంకా పెంచాలని యాత్ర చేస్తున్నారా..? అంటూ కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క ప్రశ్నించారు. పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించమని యాత్ర చేయడం లేదని విమర్శించారు. భారత రాజ్యాంగం చెప్పిన లౌకికవాద ప్రజాస్వామ్య భారత దేశాన్ని నిర్మించాలని అంబేద్కర్ గారు చెబితే.. ఆయన పుట్టిన రోజే ఈ దేశాన్ని మతం పేరుతో విచ్ఛిన్నకర శక్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని, జాతిని విడగొట్టాలని చూస్తున్నారని… కేవలం అధికారాన్ని అనుభవించాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్న బండి సంజయ్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి పాదయాత్ర చేస్తున్నారా… అంటూ బట్టి, బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు. పేదల ఎకౌంట్లలో రూ. 15 లక్షల వేయనందుకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుకు పాదయాత్ర చేస్తున్నారా..? అంటూ బట్టి ప్రశ్నించారు.

బీజేపీ నాయకుడు బండి సంజయ్ దేని కోసం పాదయాత్ర చేస్తున్నారని.. పెట్రోల్ ధరలు పెంచుతున్నందుకు యాత్ర చేస్తున్నారా ..? అంటూ మధుయాష్కి ప్రశ్నించారు. కోవిడ్ ద్వారా ప్రజల ఆర్థిక స్థితిగతులు బాగా లేనప్పుడు మోదీ ప్రభుత్వం వరసగా ధరలు పెంచుకుంటూ పోతున్నారని మధుయాష్కి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news