ఒక్కో మ్యాచ్ కోసం రూ. 67 .8 కోట్లు .. బీసీసీఐ తో వయాకామ్ 18 డీల్

-

ఇండియాలో ఆడే క్రికెట్ మ్యాచ్ ల ప్రసార హక్కుల కోసం చాలా సంస్థలు పోటీ పడగా చివరికి ముఖేష్ అంబానీకి చెందిన సంస్థ దక్కించుకుని సంచలనం సృష్టించింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ముఖేష్ అంబానీకి ఉన్న చాలా కంపెనీ లలో ఒకటి అయిన వయాకామ్ మీడియా సంస్థ అధిక మొత్తానికి ఇండియాలో ఆడే అన్ని బీసీసీఐ మ్యాచ్ లకు గాను టీవీ మరియు డిజిటల్ ప్రసారాలను చేసుకునే హక్కును పొందింది. ఈ వయాకామ్ సంస్థ ఒక మ్యాచ్ కు గాను రూ. 67 .8 కోట్లు వెచ్చించి హక్కులను దక్కించుకుంది. ఇప్పుడు స్వదేశంలో ఇండియా పురుషులు మరియు మహిళలు ఆడే అన్ని మ్యాచ్ లు కూడా జియో టీవీ, స్పోర్ట్స్ 18 ఛానెల్ లో లైవ్ వస్తుంది.

ఇది బీసీసీఐ కి దక్కిన భర్తీ డీల్ అని చెప్పాలి.. అంటే సంవత్సరానికి పెద్ద మొత్తంలోనే బీసీసీఐకి ఆదాయం రానుంది. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ప్రతి రంగంలోనూ తన వ్యాపార సంస్థలను విస్తరించుకుంటూ వస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news