ఎద అందాలతో రచ్చ చేసిన ప్రపంచ సుందరి.. విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

-

2017లో ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న మానుషీ… దుబాయ్ లో జరుగుతున్న అవార్డుల వేడుకలో హాట్ లుక్స్ తో అదరగొట్టేసింది.. ఫిల్మ్‌ఫేర్‌ మిడిల్‌ ఈస్ట్‌ అవార్డుల వేడుకలో హాలీవుడ్ రేంజ్ లో స్కిన్ షో తో రెచ్చిపోయింది..

 

దుబాయ్ లో జరుగుతున్న అవార్డుల ఫంక్షన్ లో ప్రపంచ సుందరి మానుషి దుమ్మురేపింది. అందరి కళ్ళను తన వైపు తిప్పుకుంటూ రచ్చ చేసింది ఈ ఫంక్షన్కు బాలీవుడ్ తారలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎందరో నటీనటులు తరలివచ్చారు.. ఇందులో ఈ భామ హైలెట్ గా మారింది.. ఎల్లో కలర్‌ డీప్‌ నెక్‌ ఆఫ్‌ షోల్డర్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది మానుషి. ఈ ఫోటోస్ ను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేయగా.. సోషల్‌ మీడియాలో ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ ఫోటోలు చూసిన వారంతా షాక్ అయిపోతున్నారు ఎద అందాలతో రచ్చ చేస్తున్న ఈ భామను ఇంత హాట్ గా చూడలేం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ట్రోల్స్ కూడా ఫేస్ చేస్తుంది బ్యూటీ.. కొంత మంది ఈమె డ్రెస్‌ని కర్టెన్‌ అని, మరికొందరు బెడ్‌షీట్‌తో పోల్చారు.

మరికొందరు ఏకంగా మానుషిని.. ఉర్ఫీ జావెద్‌తో పోల్చారు.. మీ డ్రెస్‌లో పర్దా చిక్కుకుపోయింది.. తీయడం మరిచిపోయారు అంటూ.. మానుషీపై సెటైర్ వేశాడు మరో యూజర్‌. మరో నెటిజన్ కామెంట్ చేస్తూ.. అందరూ ఉర్ఫీతో పోటీపడుతున్నారు అని అన్నాడు.. అలాగే ఈమె ఇలా ఉంటూ.. స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహిస్తోందని, ఇలా ఎలా ప్రజలకు అవగాహన కల్పిస్తుంది అంటూ కామెంట్‌ చేశాడు.

బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈబ్యూటీ.. తన అందంతో పాటు నటనలో కూడా టాలెంట్ చూపించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అయితే ఈమె త్వరలోనే తెలుగులో కూడా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. మెగా ప్రీన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించనున్న సినిమాలో హీరోయిన్ గా మానుషీ చిల్లర్ ను తీసుకున్నట్టు టాలీవుడ్ సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news