పురుషుడిగా మారనున్న మాజీ ముఖ్యమంత్రి కూతురు..!

-

దేశంలో అనే వింతలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనుషుల లింగ మార్పిడి… ఈ మధ్య కాలంలో చాలా కామన్‌ అయిపోయింది. టెక్నాలజీ పెరగడంతో… మగ వారు ఆపరేషన్‌ చేయించుకుని.. స్త్రీలలాగా మారుతున్నారు. అలాగే, స్త్రీలు… మగవారౌతున్నారు.

అయితే.. తాజాగా పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయంపై న్యాయ నిపుణులు, వైద్యులు, ఇతర నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఇటీవల ఎల్జిబిటిక్యు ఉద్యమంలో సుచేతన పాల్గొన్నారు. “నాకు 41 సంవత్సరాలు. నాకు సంబంధించిన అన్ని నిర్ణయాలను నేనే తీసుకోగలను. దయచేసి నా తల్లిదండ్రులను ఈ వ్యవహారం లోకి లాగొద్దు” అని సుచేతన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news