పవన్ కళ్యాణ్ చెప్పులు ఎక్కడున్నాయో చెప్పిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్…

-

పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేస్తున్న సమయంలో తన చెప్పులు ఎవ్వరూ కొట్టేశారని చెప్పిన విషయం చాలా వైరల్ అయింది. తాజాగా భీమవర్షం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆ చెప్పులు ఎక్కడ ఉంటాయో సరిగ్గా చెప్పాడు. భీమవరం లో మాట్లాడిన గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ… పవన్ నువ్వు చాలా సార్లు చంద్రబాబును మరియు లోకేష్ ను కలవడానికి వెళ్లానని చెప్పారు కదా.. ఇక కొన్ని సార్లు వెనుక గుమ్మం నుండి వెళ్లిపోయారు అని మీరే చెప్పారు, ఎన్ని సూట్ కేసులతో వెళ్లారో ఎవ్వరికీ తెలియదు. అప్పుడు తొందరపాటులో ఆ చెప్పులు చంద్రబాబు ఇంటి గుమ్మం దగ్గర ఏమైనా వదిలి వెళ్ళారా చూడండి అంటూ సలహా ఇచ్చారు గ్రంధి శ్రీనివాస్.

చూస్తుంటే ఈ కామెంట్ లు చాల వ్యంగ్యంగా చెప్పినట్లు కనిపించినా కొందరు నిజమే అయి ఉంటుందని తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. కాగా పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో ఫోకస్ చేసి వైసీపీని ఓడించాలని సర్వప్రయత్నాలు చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news