ఆ 34 సీట్లలో వైసీపీ ఒక్కటి కూడా గెలవకూడదు : పవన్ కళ్యాణ్

-

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ అక్కడ కింగ్ మేకర్ గా నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. వరుసగా జరుగుతున మీటింగ్ లలో పవన్ మాట్లాడుతూ ఈ రెండు జిల్లాలో కలిపి జగన్ నేతృత్వంలోని వైసీపీ ఒక్కటంటే ఒక్క సీట్ కూడా గెలవడానికి వీళ్ళు లేదు అంటూ ప్రజలను ఉద్దేశించి అన్నాడు. కాగా ఈ రెండు జిల్లాల్లో కలిపి చూస్తే మొత్తం 34 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు (రాజోలు) మాత్రమే గెలుచుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన… ఇప్పుడు అయిదు సంవత్సరాలలో అన్ని సీట్లను గెలుచుకే అంతలా ఆ ప్రజలకు పవన్ ఏమిచేశాడని కొందరు అప్పుడే విమర్శలు స్టార్ట్ చేశారు.

ఏది ఏమైనా పవన్ చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. వాస్తవంగా చూస్తే మాత్రం వైసీపీ మీద అంతగా వ్యతికరేకత లేదు.

Read more RELATED
Recommended to you

Latest news