కలకలం; బిజెపి ఎంపీ ఇంటికి పౌడర్…! ఎవరు పంపించారు…?

-

భోపాల్ బిజెపి ఎంపి ప్రగ్యా ఠాకూర్ నివాసానికి వచ్చిన అనుమానాస్పద లేఖ ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. ప్రగ్యా ఠాకూర్ ఇంటికి పంపిన లేఖ ఉర్దూలో రాయడంతో పాటుగా ఆ లేఖతో పాటుగా పొడి లాంటి పదార్థం కూడా దొరికిందని జాతీయ మీడియా పేర్కొంది. ప్రగ్యా ఠాకూర్ సిబ్బందికి లేఖ దొరికిన వెంటనే వారు భోపాల్ పోలీసులను సంప్రదించగానే సీనియర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందాన్ని హుటాహుటిన పిలిచిన అధికారులు పౌడర్ ని ల్యాబ్ కి తరలించారు. ఇండియా టుడే టివి ఆ లేఖకు సంబంధించిన ఫోటోలను సేకరించింది. ఈ లేఖలో ప్రగ్యా ఠాకూర్, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫోటోలను క్రాస్ మార్క్ చేసినట్టు ఉంది. ఆజ్ తక్ అనే ఛానల్ తో ప్రగ్యా ఠాకూర్ మాట్లాడుతూ,

“ఈ లేఖను ఉగ్రవాదులు పంపించి ఉండవచ్చు, కానీ నేను అలాంటి బెదిరింపులకు భయపడనని స్పష్టం చేసారు. భోపాల్ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 326 తో పాటుగా మరియు 507 కింద కేసు నమోదు చేశారు. అసలు ఈ లేఖను పంపింది ఎవరూ అనే దానిపై కేంద్ర హోం శాఖ కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news