పాలకులు మంచివారైతేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది : భువనేశ్వరి

-

అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మన దేశాన్ని నడిపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన పాలకులు మంచి వారైతేనే ప్రజలకు మేలు జరుగుతుందని… వారు చెడ్డ వారైతే ప్రజలకు కీడు జరుగుతుందని అంబేద్కర్ ఆనాడే చెప్పారని తెలిపారు. వైసీపీ వాళ్లది ధన బలమైతే… టీడీపీది ప్రజా బలమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. కాళహస్తిలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Nara Bhuvaneshwari: భయపడొద్దు.. కలిసికట్టుగా పోరాడుదాం: భువనేశ్వరి | nara bhuvaneshwari face to face with womens in tirupati

రాజమండ్రి జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాయడం తెలిసిందే. దీనిపై చంద్రబాబు నారా భువనేశ్వరి స్పందించారు. తన ప్రాణాలకు ఏ విధంగా ముప్పు ఉందో చంద్రబాబు గారు రాసిన లేఖ తనను నిలువునా కుదిపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో చంద్రబాబు ఎదుర్కొంటున్న అవాంఛనీయ పరిస్థితులను తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. జైలు గోడల ఆవతల ఉన్న నా భర్త క్షేమం కోసం నాతో కలిసి ప్రార్థించాలని రాష్ట్రంలోని సోదరీమణులందరినీ అర్థిస్తున్నానని భువనేశ్వరి తెలిపారు. మనందరి సమష్టి ప్రార్థనలు చంద్రబాబు చుట్టూ దుర్భేద్యమైన రక్షా కవచంలా నిలుస్తాయని, ఆయనను ఈ కష్టాల నుంచి క్షేమంగా గట్టెకిస్తాయని భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు భువనేశ్వరి. ఈ లేఖపై నారా బ్రాహ్మణి కూడా స్పందించారు. జైలులో తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను, భద్రతా పరమైన సమస్యలను వివరిస్తూ చంద్రబాబు గారు రాసిన లేఖ మమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది అని వెల్లడించారు. జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news