బిగ్ బ్రేకింగ్ : డీఎస్సీ టీచర్ పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా

-

కొత్తగా డీఎస్సీ టీచర్ కొలువులు సాధించిన అభ్యర్థులకు అనుకోకుండా బిగ్ షాక్ తగిలింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ టీచర్ల పోస్టింగులకు సంబంధించి కౌన్సెలింగ్ జరగాల్సి ఉన్నది. కానీ అనుకోకుండా కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. డీఎస్సీ -2024 ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త టీచర్లు ఇటీవల నియామక పత్రాలు అందుకున్న విషయం తెలిసిందే.

అయితే, ఫలితాలు ప్రకటించిన మరునాడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన విద్యాశాఖ పోస్టింగులకు సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అన్ని కసరత్తులు చేసింది.ఇప్పటికే అభ్యర్థులు ఆయా జిల్లాల్లో పోస్టింగులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని తమకు కేటాయించిన పాఠశాలల్లో రిపోర్ట చేయాల్సి ఉంది. కానీ,ఊహించని విధంగా కౌన్సెలింగ్ వాయిదా పడటంతో వారంతా నిరాశకు లోనయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news