IPL 2023 : KKR కు భారీ ఫైన్

-

చెన్నై సూపర్ కింగ్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు ను కొనసాగించినందుకు KKR జట్టుకు నిర్వాహకులు జరిమానా విధించారు.

కెప్టెన్ నితీష్ రాణాకు రూ. 24 లక్షల జరిమానా విధించగా, ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ తో సహా ప్లేయింగ్ 11 లో ఉన్న ఆటగాళ్లు అందరికీ రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% చొప్పున జరిమానా విధించారు. నిన్న CSKపై కోల్కతా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

కాగా, ఐపీఎల్-2023లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. పాయింట్స్ టేబుల్ లో గుజరాత్ 16 పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉండగా, SRH 8 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో GT గెలిస్తే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలుస్తుంది. SRH గెలిచిన ప్లే ఆఫ్స్ కి చేరెందుకు అవకాశాలు లేవు.

Read more RELATED
Recommended to you

Latest news