కాంగ్రెస్ కు బిగ్ షాక్.. టిఆర్ఎస్ లోకి పల్లె రవికుమార్ గౌడ్ జంప్

-

మునుగోడు కాంగ్రెస్ కీలక నేత పల్లె రవికుమార్ గౌడ్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు. పల్లె రవికుమార్, ఆయన భార్య కళ్యాణి ప్రగతిభవన్లో కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి పల్లె రవి దంపతులను కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమ కాలంలో కలిసి పనిచేసిన పల్లి రవికుమార్ మళ్లీ టిఆర్ఎస్ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చిన పల్లె రవికుమార్ కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పల్లె రవికి కచ్చితంగా భవిష్యత్తులో మంచి రాజకీయ అవకాశాలను పార్టీ కల్పిస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news