ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన ఇలాకలో టిడిపి విజయం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కౌంటింగ్ ఫలితాలలో అధికార వైసిపి పార్టీ దూసుకెళుతోంది. ఇప్పటికే 8 మున్సిపాలిటీలను వైసిపి పార్టీ కైవసం చేసుకోగా కేవలం ఒక మున్సిపాలిటీని మాత్రమే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.

వైసిపి పార్టీ దుమ్ము దులుపుతున్న ఈ తరుణంలో… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ కు ఈ ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ షాక్ తగిలింది.

బుగ్గన నివాసంలో ఉండే 15 వ వార్డులో వైసిపి పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి పై టిడిపి అభ్యర్థి వెంకట సాయి కుమార్ 114 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించాడు. దీంతో టీడీపీ శ్రేణులు బేతంచర్ల లో సంబరాలు చేసుకుంటున్నాయి. బేతంచెర్ల లో మొత్తం 20 వార్డు ఉండగా వైసిపి 14 గెలుచుకుంది. అటు టిడిపి పార్టీ 6 వార్డుల్లో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news