టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు దళిత బంధు సెగ

-

సూర్యాపేట జిల్లా : కోదాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు దళిత బంధు సెగ తగిలింది. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలంటూ కోదాడ పట్టణంలో దళిత సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించారు. బొల్లం మల్లయ్య యాదవ్ తన పదవికి రాజీనామా చేయడం ద్వారా తాము దళిత బంధు పథకం ద్వారా లబ్దిపొందుతామని ఆందోళన చేస్తున్నాయి దళిత సంఘాలు.

అయితే.. ఈ దళిత సంఘాలకు సంఘీభావంగా బీజేపీ పార్టీ నేతలు కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దీంతో కోదాడ పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. ఈ నేపథ్యంలోనే సమాచారం అందుకున్న కోదాడ పట్టణ పోలీసులు… ర్యాలీని అడ్డుకున్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు దళిత సంఘ నేతలతో పాటు బీజేపీ నేతలను అరెస్ట్ చేసారు కోదాడ పట్టణ పోలీసులు. కాగా.. హుజురాబాద్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news