బ్రేకింగ్ : బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

-

న్యాయవాది వామన్ రావు హత్య కేసులో అరెస్ట్ అయిన  బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వామన్ రావు హత్యకు గత బిట్టు శీను నాలుగు నెలల క్రితమే ప్లాన్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. వామన్ రావ్ బతికుంటే మనకి ఎప్పుడైనా సమస్యని భావించిన బిట్టు శీను & కుంట శీను నాలుగు నెలల క్రితమే వామన్ రావు హత్యకి ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. న్యాయవాది వామన్ రావు బిట్టు శీనుకు సంబంధించిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ పై అనేక కేసులు వేశారని దీంతో నాలుగు నెలల క్రితం గుంజపడుగులోనే పాత స్కూల్ బిల్డింగ్ నుంచి శీను గ్యాంగ్ రెక్కీ నిర్వహించినట్టు చెబుతున్నారు.

.

అయతే అప్పుడు వామన్ రావు చుట్టూ జనాలు ఎక్కువ ఉండటంతో ప్లాన్ ఫెయిల్ అయిందని చెబుతున్నారు. ఇక ఈ నెల 17వ తేదీన వామనరావు ఒంటరిగా దొరకడంతో హత్యకు ప్లాన్ చేసి బిట్టు శీను & కుంట శీనులు ఎట్టకేలకు చంపేశారు. వామన్ రావు దంపతులు చనిపోయారని బిట్టు శీనుకు కుంట శీను సమాచారం అందించగా కుంట శీను అండ్ గ్యాంగ్ ను మహారాష్ట్రకు వెళ్ళిపొమ్మని బిట్టు శీను సలహా ఇచ్చినట్టు పేర్కొన్నారు. హత్య తర్వాత రెండు రోజులు ఇంట్లోనే మకాం వేసినట్టు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news