ఏపీలో జనసేన- బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

బీజేపీ చేపట్టిన రాయలసీమ రణభేరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన- బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాయలసీమలో సాగు నీటి ప్రాజెక్ట్ లు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వైసీపీని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కడప, అనంతపురం, తిరుపతిలో అనేక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లు చేపట్టిందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం జరుగుతుందని ఆని కిషన్ రెడ్డి అన్నారు. ఏపీ అభివ్రుద్ధికి మోదీ ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తోందని ఆయన అన్నారు. రాయలసీమ వెనకబడి ఉండేందుకు రాజకీయమైన, సామాజిక ప్రోత్సాహం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో లిక్కర్, ల్యాండ్ మాఫియా చెలరేగుతోందని ఆయన విమర్శించారు. ఏపీలో అవినీతి బాగా పెరిగిందని ఆయన ఆరోపించారు. అప్పులు చేసుకుంటూ..ఎన్నేళ్లు ప్రభుత్వాన్ని నడుపుతారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీలో చేరిన వారిని వేధిస్తున్నారని.. పోలీసులు, వైసీపీ అక్రమ కేసులతో వేధిస్తున్నారని విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news