బండి సంజయ్ కి ఉగ్రముప్పు.. భద్రత పెంచాలని కోరతున్న బీజేపీ

-

బండి సంజయ్ కి భద్రత పెంచాలని బీజేపీ కోరుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర శాఖ డీజీపీ మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ కి 4 ప్లస్ 4 భద్రత కల్పించాలని కోరుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడి హోదాలో నిత్యం ప్రజల మధ్య ఉంటే బండి సంజయ్ కి ఎలాంటి ప్రమాదం జరుగకుండా భద్రత పెంచాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి. గతంలో సూర్యాపేట జిల్లా గుర్రంపోడు ఘటన జరిగిన సమయంలోనే భద్రత పెంచాలని డీజీపీని కోరారు. వరి ధాన్యం కల్లాలను పరిశీలిస్తున్న సమయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షన చెలరేగింది. బండి సంజయ్ కాన్వాయ్ పైకి రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు.

మరోవైపు బీజేపీ నేతలే లక్ష్యంగా కొన్ని ఉగ్రవాద సంస్థలు దాడి చేసే అవకాశం ఉండటంతో బండి సంజయ్ కి భద్రత పెంచాలని కోరుతున్నారు. ఇటీవల ఉగ్రదాడులు జరగచ్చనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ బీజేపీ ఆఫీసుకు భద్రతను కూడా పెంచారు.

Read more RELATED
Recommended to you

Latest news