కరోనాతో బీజేపీ మాజీ ఎంపీ మృతి..!

-

దేశ ప్రజలను కరోనా వైరస్‌ గజగజ వణికిస్తోంది. కరోనా ధాటికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. అధికారులు, నాయకులు, ప్రజలు ఇలా వరుసబెట్టి అందరినీ పలకరిస్తుంది కరోనా. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా ముంబైకి చెందిన బీజేపీ మాజీ ఎంపీ హరిభావ్ జావలె ఈరోజు కరోనాతో మరణించారు. ఈనెల ఆరంభంలో కరోనా బారినపడగా..ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా, వెంటిలేటర్ అమర్చేలోగానే జావలె మరణించారని వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news