తెలంగాణలో బిజెపి ప్రభుత్వం రావడం ఖాయం: కేంద్ర సహాయ మంత్రి వికే సింగ్

-

తెలంగాణలో బిజెపి ప్రభుత్వం రావడం ఖాయం అన్నారు కేంద్ర విమానయాన, రోడ్లు, భవనాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ఎనిమిది సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళతామని అన్నారు. మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. మా సిద్ధాంతం ప్రకారం కులం, మతం, వర్గం వంటి భేద భావాలు ఉండవు అని తెలిపారు.

ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, నాయకులను కలిసి పార్టీ విస్తరణ కొరకు పని చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చారు కానీ వీటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని మండిపడ్డారు. కెసిఆర్ పాలన పట్ల ప్రజలలో అసంతృప్తి నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడే కేసీఆర్ ముందస్తుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని వీకే సింగ్ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news