తెలంగాణలో బిజెపికి స్థానం లేదు – మంత్రి నిరంజన్ రెడ్డి

-

ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీకి స్థానం లేదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఖమ్మం భారీ బహిరంగ సభతో బిజెపిలో ప్రకంపనలు మొదలయ్యాయన్నారు. వనపర్తి నియోజకవర్గం లోని శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామానికి చెందిన పలువురు నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో రాష్ట్రం సాధించిన విధంగానే దేశ సంక్షేమం కోసం అంతే పట్టుదలతో ఉన్నారని వెల్లడించారు.

బిఆర్ఎస్ ఏర్పాటుతో దేశ రాజకీయాలలో పెను మార్పులు వచ్చాయని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్ అభివృద్ధి కోసం ఎదురుచూస్తుందని అన్నారు నిరంజన్ రెడ్డి. బిజెపికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చిన బిజెపి దేశాన్ని అన్ని రంగాలలో బ్రష్టు పట్టించిందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news