పంజాబ్ లో ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది – కేజ్రీవాల్

-

ఢిల్లీని దాటి పంజాబ్ లో అధికారం అందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి తమకు పోటీగా మారుతుంది అన్న భయంతో బిజెపి బెదిరింపులకు దిగుతుందని.. ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తోందని.. తద్వారా పార్టీని చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. పంజాబ్ లో ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బిజెపి ప్రయత్నం చేస్తుందని అన్నారు.

పంజాబ్ లో పదిమంది ఆప్ ఎమ్మెల్యేలను బిజెపి సంప్రదించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఆ మధ్య ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేస్తే బిజెపి విఫలం అయిందని.. ఇప్పుడు బిజెపి పంజాబ్ పై ఫోకస్ పెట్టిందని అన్నారు. దీంతో పంజాబ్ లో ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news