బీజేపీకి జనసేన షాక్.. ఆ దూరం దేనికి సంకేతం ?

-

ఆంధ్ర ప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నిక ముందు బీజేపీకి టెన్షన్ పట్టుకుంది. దానికి కారణం జనసేన కేడర్ అయోమయంలో ఉండడమే. నిజానికి ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామంటే తాము పోటీ చేస్తామని జనసేన – బీజేపీలు ఉవ్విళ్ళూరాయి. ఎట్టకేలకు బీజేపీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ ఉప ఎన్నిక విషయంలో జనసేన సైలెంట్ గా ఉంటుందని అన్నారు. ఎన్నికల రెండు అంచెల వ్యవస్థతో కమిటీలు వేసింది.

కానీ ఇప్పటి వరకు ఉప ఎన్నికలకు జనసేన మాత్రం ఇన్ చార్జ్ లను ప్రకటించలేదు. ఈరోజు ఆర్డీవో కార్యాలయం వద్ద ఇసుక పాలసీకి వ్యతిరేకంగా బిజెపి ధర్నా చేపట్టింది. అయితే ఈ ధర్నాకి జనసేన దూరంగా ఉన్నట్లు చేబుతున్నారు. అసలు ఉప ఎన్నికల వ్యూహం ఏంటో కూడా జనసేన బయట పడడం లేదు. అలాగే ప్రచారంపై కూడా ఇప్పటి దాకా క్లారిటీ రాలేదని అంటున్నారు. దీంతో బీజేపీ టెన్షన్ లో ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news