బీజేపీ దిమ్మతిరిగే షాక్‌…టీఆర్‌ఎస్‌ చేరిన కీలక నేతలు

-

రంగారెడ్డి జిల్లా జిల్లాలో బీజేపీ పార్టీకి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. బీజేపీకి మణికొండ మున్సిపల్‌ 8వ వార్డు కౌన్సిలర్ నవీన్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షం లో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు బీజేపీ కౌన్సిలర్ నవీన్ కుమార్. అంతేకాదు…. అతని మరో 200 మంది అనుచరులు టీఆర్ఎస్ పార్టీ లో చేరారు.

ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై టీఆర్ఎస్ పార్టీలో చేరానని వివరించారు. బీజేపీ పార్టీకి రాజీనామ చేసిన తన అనుచరులు కూడా టీఆర్ఎస్ లో చేరారని తెలిపారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి……‌ అధికారంలో వున్న టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని వెల్లడించారు.  నేటి నుండి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి పని చేస్తానని చెప్పిన నవీన్‌ కుమార్‌….తన వార్డులో ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేరుస్తానని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news