16 రౌండ్ లో బీజేపీకి భారీ ఓట్ల ఆధిక్యం

-

హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వన్ సైడ్ వార్ గా మారిపోతుంది. రౌండ్స్ కౌంటింగ్ పెరుగుతున్న నేపథ్యంలో.. బిజేపి అభ్యర్థి ఈటల రాజేందర్ మెజారిటీ పెరుగుతూనే ఉంది. పోస్టల్ బ్యాలెట్, ఎనిమిదో రౌండ్, 11 వ రౌండ్ మినహా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేక పోయింది. ఇక తాజాగా 16వ రౌండ్‌ ఫలితాలు వెలువడ్డాయి.

etala
etala

16వ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కి ఏకంగా 1712 ఓట్ల ఆధిక్యం లభించింది. అలాగే 16 రౌండ్ల ఫ‌లితాలు ముగుసే సరికి … బీజేపీ పార్టీ కి 74,175 ఓట్లు పోల్ కాగా , టీఆర్ఎస్ పార్టీ కి 60,920 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో 16 రౌండ్లు ముగిసే స‌రికి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ కి ఏకంగా 13,195 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇక  హుజురాబాద్ ఉప ఎన్నికల తుది ఫలితాలు మరో 6 రౌండ్ లలో తెలనుంది. ఈ 6 రౌండ్ లలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కే ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు సంచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news