మీ గొయ్యి మీరే తీసుకున్నారు.. .. పేర్నినానికి బీజేపీ కౌంటర్

-

 

అమరావతి: మంత్రి పేర్ని నానికి బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. బాబాలు సీఎం కావాలన్న పేర్ని నాని వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు ధియోదర్, సీవీఎల్. నరసింహారావు, సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు.ప్రభుత్వాన్ని కూల్చాల్సిన పని తమకు లేదని ధియోదర్ మండిపడ్డారు. ఆ ఆలోచన కూడా తమకు లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. వేల కోట్ల అవినీతి చేసి తమ గొయ్యి తమరే తీసుకున్నారని ఆరోపించారు.

సీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ కేంద్రంపై నిఘా మోపి ప్రజల దృష్టి మరల్చాలనుకుంటున్నారన్నారు. ఫెయిల్ అయిన టీడీపీ డ్రామా స్క్రిప్టును ఫాలో అవుతున్నారని వ్యాఖ్యానించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రభుత్వంలో లేకపోయినా సమాజానికి సేవ చేయాలన్నారు. సామాజిక సేవ చేయడమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. కాషాయం కట్టుకునే సీఎం అవుతారని అధికార పార్టీ నేత తెలిసి అన్నారో.. కంగారు పడ్డారో అర్ధం కావడంలేదని ఎద్దేవా చేశారు. 3 రోజుల్లో ఇంకేదో జరిగిపోతుందని మరొకరు అంటున్నారని మండిపడ్డారు. బాబాలను విమర్శించే హక్కు నానికి లేదన్నారు. తమ బాబా ముఖ్యమంత్రి 500 మంది గూండాలను హతమార్చారని చెప్పారు. మరి ఏపీలో ఎంతమంది గూండాలను జైలు పంపారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చామో తాము చర్చకు రెడీ అని సోము వీర్రాజు సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news