టీఆర్ఎస్ మునుగుతున్న ప‌డ‌వ : బీజేపీ నేత ల‌క్ష్మ‌ణ్

-

బీజేపీ చేప‌డుతున్న ప్ర‌జా సంగ్రామ యాత్ర‌కు రాష్ట్రం న‌లుమూలల నుంచి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ల‌క్ష్మ‌ణ్ అన్నారు. నాంప‌ల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో మీడియాతో ల‌క్ష్మ‌ణ్ మాట్లాడారు. బండి సంజ‌య్ పాద‌యాత్ర‌కు ప్రజా ఆద‌ర‌ణ చూసి ఓర్వ‌లేకే మంత్రి కేటీఆర్ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర గురించి కేటీఆర్ మాట్లాడితే.. ద‌య్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టు ఉంద‌ని ఎద్దేవ చేశారు.

ఈ యాత్ర ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ప్ర‌కంపన‌లు సృష్టిస్తోంద‌ని అన్నారు. బండి సంజ‌య్ పాద‌యాత్ర‌తో రాష్ట్రంలో టీఆర్ఎస్ పాల‌న అంతానికి నాంది కాబోతుంద‌ని అన్నారు. టీఆర్ఎస్ మునుగుతున్న ప‌డ‌వ అని విమ‌ర్శించారు. టీఆర్ఎస్ పై ప్ర‌జ‌లు న‌మ్మ‌కం కోల్పోతున్నార‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి, మంత్రులు మోకాళ్ల యాత్ర చేసినా.. ఇక న‌మ్మ‌ర‌ని అన్నారు. .పాల‌మూరును అభివృద్ధి చేయాల‌నే ఆలోచ‌ననే ప్ర‌భుత్వానికి లేద‌ని విమ‌ర్శించారు. పాల‌మూరులో ప్రాజెక్టులు నిర్మిస్తున్నామ‌ని చెప్పి.. ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని విమ‌ర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news