కేసీఆర్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ ..!

-

వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో అలజడి మొదలయ్యింది. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆస్తులను ప్రవేటీకరణ చేయడానికి నడుం బిగించింది. అందులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఒకటి. కానీ అమ్మడానికి వీలు లేదని చాలా కాలంగా నిరసనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. కాగా తాజాగా ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం బిడ్ లను ఆహ్వానిస్తున్నట్లు.. ఆ బిడ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనితో తెలుగు రాష్ట్రాలలో రచ్చ రచ్చగా ఉంది. ఈ న్యూస్ పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ కేసీఆర్ నుండి అధికారిక ప్రకటన వచ్చాకే స్పందిస్తానని చెప్పాడు.

ఇక తాజాగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రజలను గత 8 సంవత్సరాలుగా మోసం చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఏపీ ప్రజలను కూడా మోసం చేయడానికి KCR మరియు KTR లు సిద్ధమయ్యారు అన్నాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయాన్ని అడ్డంగా పెట్టుకుని 2024 లోనూ గెలవాలని పెద్ద ప్లాన్ లోనే ఉన్నారంటూ మండిపడ్డారు. ముందు తాను చెప్పిన హామీ సంగతి చూసి.. తర్వాత పక్క రాష్ట్రాల సంగతి చూడు అంటూ కౌంటర్ ఇచ్చాడు విష్ణు. ఇప్పటి వరకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఊసేలేదు అంటూ ఎద్దేవా చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news