బీజేపీ ఎంపీకి కరోనా.. పార్టీ నేతల్లో ఆందోళన..!

-

ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ లాకెట్ ఛ‌ట‌ర్జీకి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు శుక్ర‌వారం వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఎంపీ ఛ‌ట‌ర్జీ ట్వీట్ చేశారు. త‌న‌కు క‌రోనా వైర‌స్ పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని తెలిపారు. గ‌త వారం రోజుల నుంచి త‌న‌కు స్వ‌ల్ప జ్వ‌రం ఉండ‌టంతో సెల్ఫ్ ఐసోలేష‌న్ లో ఉన్నాన‌ని వెల్లడించారు.

అయితే తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని ఆమె పేర్కొన్నారు. కాగా, జూన్ 19న నిర్వ‌హించిన ఆర్మీ జ‌వాను రాజేష్ ఓరాంగ్ అంత్య‌క్రియ‌ల్లో ఎంపీ ఛ‌ట‌ర్జీతో పాటు ఎంపీ సుమిత్రా ఖాన్ పాల్గొన్నారు. ఈ అంత్య‌క్రియ‌లకు వంద‌లాది మంది హాజ‌ర‌య్యారు. అలాగే బీజేపీ మద్దతుదారులతో కలిసి జూన్‌ 24న రహదారి ముట్టడి కార్యక్రమానికీ లాకెట్‌ ఛటర్జీ హాజరయ్యారు. దీంతో ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఛటర్జీతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, సన్నిహితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news