సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బీజేపీ జెండా ఎగురవేస్తాం – నందీశ్వర్ గౌడ్

-

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బీజేపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు నందీశ్వర్ గౌడ్. ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ముంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు రావాలని… గోల్కొండ ఖిల్లా పై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. త్వరలో జరగనున్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులేరంటున్నారు… కంటోన్మెంట్ లో బీజేపీ అభ్యర్థిని అధిష్టానం నిలబెట్టి గెలిపించుకుంటుందని వివరించారు.

బీజేపీ రాష్ట్రంలో రోజురోజుకూ బలపడుతోందని.. పటాన్ చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాపాల రెడ్డిగా మారారన్నారు. 2 కోట్ల నుంచి 2 వేల కోట్లకు ఎదిగాడని… వచ్చే ఎన్నికల్లో డబ్బులతో ఓట్లను కొనాలని చూస్తున్నాడని ఆగ్రహించారు. ఓటుకు రూ. 20 వేల నుంచి 30 వేలు ఇస్తామంటున్నారని.. ప్రజలు సరైన వ్యక్తిని గెలిపిస్తారని భావిస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్యే, తన సోదరుడు దౌర్జన్యాలకు పాల్పడుతూ అక్రమంగా భూములను కాజేస్తున్నారని.. ఫైర్‌ అయ్యారు నందీశ్వర్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news