రిమోట్ ఓటింగ్ విధానాన్ని BRS వ్య‌తిరేకిస్తోంది – బోయినపల్లి వినోద్ కుమార్

-

రిమోట్ ఓటింగ్ విధానాన్ని BRS వ్య‌తిరేకిస్తోందన్నారు రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్. ఆ ప‌ద్ధ‌తి దేశంలో అవ‌స‌రం లేదని..అభివృద్ధి చెందిన దేశాలే రిమోట్ ఓటింగ్ విధానాన్ని ప‌క్క‌న పెడుతున్నాయని వెల్లడించారు. బీ.ఆర్.ఎస్. పార్టీగా మేం రిమోట్ ఓటింగ్ విధానాన్నివ్య‌తిరేకిస్తున్నాం. ఆ ప‌ద్ధ‌తి దేశంలో అవ‌స‌రం లేదని స్పష్టం చేశారు.

ఎన్నిక‌ల్లో వాడుతున్న ఈవీఎంల‌ను హ్యాక్ చేస్తున్నార‌నే అనుమానాలు, ప్ర‌చారాలు బ‌లంగా ఉన్నాయి..వాటినే ఈసీ ఇప్ప‌టి వ‌ర‌కు నివృత్తి చేయ‌లేదు. అలాంటప్పుడు మ‌ల్టీ కానిస్టిట్యూయెన్సీ రిమోట్ ఓటింగ్ యంత్రాలను ఎలా విశ్వ‌సిస్తామని తెలిపారు.

అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లాండ్ దేశాలే ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల‌ను ప‌క్క‌న‌ పెట్టేశాయి..నిత్యం బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేస్తున్న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అలాంట‌ప్పుడు ఎక్క‌డో విదేశాల్లో ఉన్న వ్య‌క్తి పేరుతో వేసే ఓట్ల‌ను ఎలా న‌మ్మ‌గ‌లమని వివరించారు. అక్క‌డి నుంచి ఆ ఓట‌రే ఓటు వేస్తున్నాడా..? హ్యాక్ చేస్తున్నారా..? ఎలా తెలుసుకోగ‌లమన్నారు రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news