బాలీవుడ్ లో విషాదం..క‌రోనాతో ప్ర‌ముఖ న‌టుడు మృతి..!

-

సినీప‌రిశ్ర‌మ‌లో మ‌రోవిషాదం చోటు చేసుకుంది. నిన్న క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి చెందిన ప్రముఖ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆ వార్త‌ను ప్రేక్ష‌కులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. అయితే ఇంత‌లోనే బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు యూసుఫ్ హుస్సేన్ క‌రోనాతో మృతి చెందారు. 73ఏళ్ల వ‌య‌సులో యూసుఫ్ హుస్సేన్ కరోనాతో ముంబైలోని లీలావ‌తి ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న ఈరోజు క‌న్నూ మూశారు.

bollywood actor died with corona
bollywood actor died with corona

యూసుఫ్ హుస్సేన్ ధూమ్ 2, రాయిస్ లాంటి సినిమాల‌తో ఎంతో గుర్తింపును తెచ్చుకున్నారు. యూసుఫ్ హుస్సేన్ మ‌ర‌ణ‌వార్త‌ను ఆయ‌న అల్లుడు స్కామ్ 1992 ద‌ర్శ‌కుడు హ‌న్స‌ల్ మెహ‌తా వెల్ల‌డించారు. అంతే కాకుండా ఆయ‌న త‌న‌కు మామ కాద‌ని తండ్రిలాంటి వాడ‌ని హ‌న్స‌ల్ మెహ‌తా ఎమోష‌నల్ అయ్యారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ ప్రముఖులు అభిషేక్ బ‌చ్చ‌న్ మ‌రియు ప‌లువురు యూసుఫ్ మ‌ర‌ణం పై సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news