బ్రేకింగ్:బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ మృతి…

-

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నిషికాంత్ కామత్ ఈ రోజు సాయంత్రం కన్ను మూశారు. 4 గంటల 24 నిమిషాలకు ఆయన కన్ను మూశారు అని ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయన గత రెండు సంవత్సరాలుగా లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్ లో ఆయన చికిత్స కూడా తీసుకుంటున్నారు.

ఆయన ఆరోగ్యం నిన్నటి నుంచి విషమించింది. ఆయన నేడు వెంటిలేటర్ పై ఉండగా పలువురు మరణించారు అని సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా చేసారు. ఇక క్రమంగా ఆయన వైద్యానికి కూడా స్పందించలేదు. హింది లో దృశ్యం సినిమాను ఆయన తెరకెక్కించారు. ఈ సినిమాతో పాటుగా ముంబై మేరి జాన్ అనే హిట్ సినిమాను కూడా ఆయన ప్రేక్షకులకు అందించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news