తునీషా మరణం పై సంచలన కామెంట్లు చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ ఎంతైతే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా.. కాంట్రవర్సీ కి డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ లో కూడా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది కంగనారనౌత్.. సమాజంలో జరిగే ప్రతి విషయంపై కూడా ఆమె స్పందిస్తూ వివాదాలకు తెర లేపుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ సీరియల్ నటి తునీషా శర్మది ఆత్మహత్య కాదని హత్యే అని సంచలన వ్యాఖ్యలు చేసింది. ” స్త్రీ అన్నింటిని తట్టుకోగలదని.. కానీ వారిని ఇప్పటికీ మానసికంగా, శారీరకంగా కృంగదీస్తున్నారు” అంటూ పలు సంచలన కామెంట్లు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

తునీషా తాను నటిస్తున్న అలీ బాబా : దస్తాన్ ఈ కాబూల్ సీరియల్ సెట్ లోని మేకప్ రూమ్ లో ఉరి వేసుకుని చనిపోయింది . 20 ఏళ్ల తునీషా అకాల మరణం ఇండస్ట్రీని షాక్ కి గురిచేస్తుంది. ముఖ్యంగా ఆమె ఆత్మహత్య కేసును ప్రస్తుతం ముంబై పోలీసులు విచారిస్తున్నారు. అంతేకాదు ఈమె మరణానికి తన మాజీ ప్రియుడు షీజన్ ఖాన్ కారణమంటూ తునీషా తల్లి ఆరోపించడంతో ముంబై పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఇప్పుడు కంగనా రనోత్ ఇన్ స్టా వేదికగా ఆమె మరణం పై స్పందిస్తూ సుదీర్ఘ నోట్ ఒకటి పోస్ట్ చేసింది.

“ఒక స్త్రీ ప్రేమ, వివాహం, ప్రేమలో విఫలమైన , వివాహ బంధంలో ఆటుపోటులైన ఎదుర్కోగలదు.. కానీ ఒక మహిళకు నిజమైన ప్రేమ ఎప్పుడూ లభించడం లేదు. వారిని మానసికంగా, శారీరకంగా వాడుకొని మరింత కృంగదీస్తున్నారు. మన ఆడపిల్లలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. స్త్రీలకు భద్రత లేని భూమి వినాశనానికి గురవుతుంది. మహిళలపై ఆసిడ్ దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలి. అలాంటి వారికి విచక్షణ లేకుండా మరణశిక్ష విధించాలి.. స్త్రీలు మానసికంగా, శారీరకంగా ఉపయోగించుకోవడానికి మరో వ్యక్తికి అవకాశం లేదు. అలాంటి సమయంలో ఒక స్త్రీ తన సొంత నిర్ణయాలను నమ్మదు. జీవితాంతం ఉండడం లేదా చనిపోవడం ఈ రెండింటికి వ్యత్యాసం లేదు అని.. అందుకే జీవితాన్ని ముగించాలని అనుకుంటుంది.. కానీ తునిషాదీ ఆత్మహత్య కాదు హత్యే” అంటూ చెప్పుకొచ్చింది కంగనా.

Read more RELATED
Recommended to you

Latest news